సర్కారు వారి పాట షూటింగ్ తిరిగి ప్రారంభించగానే
మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అధికారికంగా ప్రకటిస్తాం - చిత్ర యూనిట్.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్
దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్,
జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి
సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్నారు. కరోనా
సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే..కాగా 'సర్కారు వారి
పాట షూటింగ్ తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అధికారికంగా
ప్రకటిస్తామని అప్పటివరకు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ సురక్షితంగా ఉండండి' అని చిత్ర
యూనిట్ తెలిపింది.
నటీనటులు: సూపర్స్టార్ మహేశ్బాబు,
కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు టెక్నీషియన్స్ సంగీతం: తమన్ ఎస్.ఎస్,
సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్,
ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ
రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట,
గోపి ఆచంట, రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల.
Read
More: http://www.zeecinemalu.com/en/news-gossip/official-statement-from-sarkaru-vaari-paata-unit-190844/
No comments:
Post a Comment