Wednesday, April 28, 2021

Darling Prabhas Nag Ashwin Movie Launch Details | Zee Cinemalu Movie Updates

 ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సైన్స్ ఫిక్షన్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఎనౌన్స్ మెంట్ నుండే అందరినీ ఎట్రాక్ట్ చేసి అంచనాలు పెంచేసిన కాంబో సినిమా ఇంకా ఆలస్యం అవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా జూన్ లేదా జులై లో రెగ్యులర్ షూట్ జరుపుకోవాలి. కానీ కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగా ఉండటంతో ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ తన చేతిలో ఉన్న 'సలార్', 'ఆది పురుష్' సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. రెండు కొలిక్కి వచ్చాకే ప్రభాస్ -నాగ్ అశ్విన్ సినిమా మొదలవుతుంది.

ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సినిమా ఏడాది దీపావళికి పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని సమాచారం. లాంచ్ అయిన అదే నెలలో లేదా డిసెంబర్ నుండి సినిమా షూట్ జరుపుకోనుందని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసుకున్నారు మేకర్స్. ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలో బిగ్ బీ అమితాబ్ ముఖ్య పాత్రలో నటిస్తుండడం విశేషం.

ఇక సినిమాలో ఉండే మరికొన్ని క్యారెక్టర్స్ కి కూడా ఆర్టిస్టులను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ బేనర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సినిమా లో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడని టాక్ ఉంది. ఇప్పటికే ప్రభాస్ లుక్ ఫిక్స్ చేసి క్యారెక్టర్స్ కి కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేయిస్తున్నారట. ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా దాదాపు ఏడాదిన్నర పైనే షూట్ జరుపుకోనుందని అంటున్నారు. అందుకే లోపు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడట ప్రభాస్. సో కాంబో సినిమా 2022 లో రావడం కష్టమే అంటున్నారు. చూడాలి ప్రచారంలో ఉన్నట్టు సినిమా షూట్ కి అంత సమయం పడుతుందా ? లేదా అనుకున్న ప్లానింగ్ ప్రకారం షూట్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సినిమాను రిలీ చేస్తారా ?

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/prabhas-nag-ashwin-movie-launch-details-188679/

Monday, April 26, 2021

Mahesh Trivikram Movie Announcement Soon | Zee Cinemalu Movie News Updates

 మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన మహేష్ -త్రివిక్రమ్ కాంబో సినిమాకు సంబంధించి ఎట్టకేలకు ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాను వచ్చే నెల మే31న ఎనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్.

ఆరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ప్రతీ ఏడాది ఆ డేట్ కి మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ వస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ కి ఉన్న కొన్ని సెంటిమెంట్స్ లో తండ్రి పుట్టిన రోజు కూడా ఒకటి. అందుకే మహేష్ సూచన మేరకూ మేకర్స్ ఈ డేట్ కి ఎనౌన్స్ మెంట్ ఫిక్స్ అయ్యారట. అన్ని అనుకున్నట్లు జరిగితే అదే రోజు ఉదయం సినిమాను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికీ రెండు సినిమాలొచ్చాయి. వాటిలో 'అతడు' క్లాసిక్ అనిపించుకోగా 'ఖలేజా' బోల్తా కొట్టింది. తమ కాంబోలో మూడో సినిమా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ ఫ్యాన్స్ కి చాలా సార్లు మాటిచ్చారు మహేష్ -త్రివిక్రమ్. ఎట్టకేలకు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మూడో సినిమా కోసం కలుస్తుంది ఈ కాంబో.

ఇప్పటికే మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన త్రివిక్రమ్.. స్క్రిప్ట్ కి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుందని సమాచారం. ఇప్పటికే క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే యాక్టర్స్ ని సెలెక్ట్ చేసే పనిలో త్రివిక్రమ్ అండ్ టీం బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే హీరోయిన్స్ గా పూజా హెగ్డే తో పాటు కియరా అద్వాని ని కూడా తెసుకున్నట్లు ఇన్సైడ్ టాక్.

ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. సినిమాకు సంబంధించి ఇంకా చాలా షూట్ బ్యాలెన్స్ ఉంది. అందుకే సినిమాతో పాటే త్రివిక్రమ్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడట మహేష్. జూన్ లేదా జులై నుండి క్రేజీ కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్, GMB ఎంటర్టైన్ మెంట్స్ బేనర్లు సినిమాను నిర్మిస్తాయని టాక్. ఇక సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఫిక్స్. త్రివిక్రమ్-తమన్ కాంబోలో రానున్న మూడో సినిమా ఇది.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/mahesh-trivikram-movie-announcement-soon-188586/

Demand for OTT has risen again | Zee cinemalu Movie Updates

 ప్రస్తుతం కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టేసారు. తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్గ్యూ పెట్టారు. ఎఫెక్ట్ తో థియేటర్స్ కూడా మూతబడ్డాయి. అందుకే కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ చేసే ఆలోచనను విరమించుకుంటూ ఓటిటి వైపు మొగ్గుచూపుతున్నారు మేకర్స్. ఇక అనసూయ నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా కూడా OTT లో రిలీజ్ చేస్తున్నారు. ముందుగా సినిమాను నెల 30 థియేటర్స్ లో రిలీజ్ చేసి వెంటనే OTT లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియక మేకర్స్ మరియు OTT టీం కలిసి మే 7 డైరక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

ఇక అనసూయ సినిమాతో పాటే మిగతా సినిమాలు కూడా మెల్లగా OTT బాట పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సినిమా తీసి రిలీజ్ కి రెడీ చేసిన మేకర్స్ కి ఓటిటి నే బెస్ట్ ఆప్షన్ గా మారింది. నిజానికి కరోన ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్కొక్కటిగా వరుస సినిమాలు నేరుగా ఆడియన్స్ ఇంట్లోకి వచ్చేశాయి. లాక్ డౌన్ అనంతరం కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజై మంచి విజయాలు అందుకోవడంతో ఇక మిగతా సినిమాలు థియేటర్స్ వైపు చూశాయి.

మళ్ళీ ఇప్పుడు సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా మెల్లగా OTT లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇటివలే రిలీజ్ వరకూ వచ్చి ఆగిపోయిన ఇష్క్ లాంటి మిగతా చిన్న సినిమాలు కూడా డిజిటల్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి సెకండ్ వేవ్ లో ఎన్ని సినిమాలు డైరెక్ట్ ఓటిటి ద్వారా విడుదలవుతాయో ఎలాంటి హిట్స్ సాధిస్తాయో చూడాలి.

ఏదేమైనా థియేటర్స్ మూతతో ఎఫెక్ట్ అవుతున్న చిన్న నిర్మాతలకు OTT అనేది బెస్ట్ ఆల్టర్నేట్ అనిపిస్తుంది.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/demand-for-ott-has-risen-again-188588/

Wednesday, April 21, 2021

Nanis Shyam Singha Roy Final Schedule In 6 Cr Worth Massive Set In Hyderabad | Zee Cinemalu News

న్యాచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్‌ సింగ రాయ్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ ఆడియన్స్‌లో సినిమా పట్ల మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తూ అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలను భారీగా పెంచేసింది.

 

తాజాగా ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల..కోల్‌కతాను త‌ల‌పించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో రీ క్రియేట్‌ చేశారు. ఆరున్నర కోట్ల భారీ బడ్జెట్‌తో ప‌ది ఎక‌రాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. హీరో నాని స‌హా ముఖ్యతారాగణంపై ప‌లు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రేపు థియేట‌ర్‌ల‌లో ఈ స‌న్నివేశాలు సినీ ప్రియుల‌కి ఒక కొత్త అనుభూతిని పంచ‌నున్నాయ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

 

ద‌ర్శ‌కుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ఓ యూనిక్‌ కాన్సెప్ట్‌తో ‘శ్యామ్‌సింగ రాయ్‌ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త‌న గ‌త చిత్రాల‌కు భిన్న‌మైన స‌రికొత్త గెట‌ప్స్‌ల‌లో నేచుర‌ల్ స్టార్ నాని క‌నిపించ‌నున్నారు.

 

సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ టిస్తోన్న చిత్రాన్ని

ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్బోయనపల్లి రూపొందిస్తున్నారు.

 

నిహారిక ఎంటర్టైన్మెంట్ తాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రానికి సత్యదేవ్జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేషల్ అవార్డ్ విన్నర్ నవీన్నూలి సినిమాకు ఎడిటర్గా వర్క్చేస్తున్నారు.

 

సాంకేతిక నిపుణులు

డైరెక్టర్‌: రాహుల్సంకృత్యాన్

నిర్మాత: వెంకట్బోయనపల్లి

బ్యానర్‌: నిహారిక ఎంటర్టైన్మెంట్

ఒరిజినల్స్టోరీ: సత్యదేవ్జంగా

మ్యూజిక్డైరెక్టర్‌ : మిక్కీ జే మేయర్

సినిమాటోగ్రఫీ: ను జాన్వర్గీస్

ప్రొడక్షన్డిజైనర్‌: అవినాష్కొల్ల

ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్‌: ఎస్‌ .వెంకటరత్నం (వెంకట్‌)

ఎడిటర్‌: నవీన్నూలి

 

Read More: http://www.zeecinemalu.com/news-gossip/nanis-shyam-singha-roy-final-schedule-in-6-5-cr-worth-massive-set-in-hyderabad-188424/ 

Will Tollywood Rrr Movie Postpones Again | Zee Cinemalu News Telugu

 మోస్ట్ ఎవైటింగ్ మల్టీస్టారర్ సినిమా ‘RRR’ రిలీజ్ మళ్ళీ వాయిదా పడనుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుందిఎన్టీఆర్రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏడాది సంక్రాంతి కి సినిమా థియేటర్స్ లో ఉండాలి. కానీ కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా సినిమాను అక్టోబర్ లో దసరా బరిలో నిలిపారు మేకర్స్.

అయితే ఇప్పుడు డేట్ కి కూడా సినిమా రావడం కష్టమే అనే టాక్ గట్టిగా వినబడుతుంది.

ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్ వాయిదా పడుతున్నాయి. మరోవైపు థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఇక మహారాష్త్ర లాంటి రాష్ట్రాల్లో కరోన వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ పెట్టారు. ఇక RRR కి సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. పైగా పోస్ట్ ప్రొడక్షన్ కి ఆరు నెలలపైనే కావాలి.

 ఇవన్నీ దాటి సినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో రావాలనుకున్నా పాన్-ఇండియా రిలీజ్ కోసం, మిగతా స్టేట్స్ లో కూడా పరిస్థితులు సెట్ అవ్వాలి. ఎందుకంటే రాజమౌళి తీసినబాహుబలిఫ్రాంచైజీ నార్త్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. బాలీవుడ్ లో సినిమాలకు రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. అందుకే రాజమౌళి నుండి వస్తున్న సినిమాపై బాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక విదేశాల్లో కూడా RRR బాగా కలెక్ట్ చేయాలి లేదంటే బయ్యర్స్ నష్టపోతారు.

 ఇలా RRR ముందు చాలానే చిక్కులు ఉన్నాయి. మరి ఇవన్నీ దాటి సినిమా ఏడాది రిలీజ్ అవ్వడం కుదరని పని అనిపిస్తుంది. అందుకే మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇంకా రిలీజ్ పై పూర్తి క్లారిటీ లేదు కానీ ఆల్మోస్ట్ సినిమా సంక్రాంతికే వస్తుందని మాత్రం ప్రచారం జరుగుతుంది. చూడాలి మేకర్స్ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో.

 Read More: http://www.zeecinemalu.com/news-gossip/will-rrr-postpones-again-188490/

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...